Nandipati Subba Rao : ఆంధ్రా యూనివర్సిటీ భూగర్భ శాస్త్ర మాజీ విభాగాధిపతి నందిపాటి సుబ్బారావు (Nandipati Subba Rao)కు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ యూనివర్సిటీ ఎల్సివియర్ సంయుక్తంగా రిలీజ్ చేసిన ప్రపంచంలోని టాప్ – 2 శాతం శాస్త్రవేత్తల జాబితా-2025లో సుబ్బారావుకు చోటు దక్కింది.
ఇటీవలే ఈ లిస్ట్ విడుదల కాగా.. లక్ష మంది శాస్త్రవేత్తల్లో ఆయన 3,105వ ర్యాంకు దక్కించుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన పరిశోధనలకుగాను ఈ ర్యాంకులు కేటాయిస్తారు. ఆచార్య సుబ్బారావు 2020 నుంచి 2025 వరకు వరుసగా ఈ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ లిస్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఆయన వెలువరించిన 135 పరిశోధన పత్రాలు ప్రసిద్ధి చెందిన జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. 73 జాతీయ, 62 అంతర్జాతీయ జర్నల్స్లో సుబ్బారావు పరిశోధనలు వచ్చాయి.