న్యూఢిల్లీ : తమ 5జీ స్మార్ట్ఫోన్లు 5జీ నెట్వర్క్కు సపోర్ట్ చేసేందుకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ను ఒప్పో ముమ్మరంగా చేపట్టింది. హైస్పీడ్ ఇంటర్నెట్, నాణ్యమైన కనెక్టివిటీ సేవల కోసం రిలయన్స్ జియోతో ఒప్పో చేతులు కలిపింది. జియో 5జీ స్టాండ్అలోన్ నెట్వర్క్పై మెరుగైన 5జీ ఎక్స్పీరియన్స్ కోసం కసరత్తు సాగిస్తోంది. ఇక ఎంపిక చేసిన 8 నగరాలు హైదరాబాద్, బెంగళూర్, ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, వారణాసి, నధ్వారాలో జియో 5జీ నెట్వర్క్కు ఒప్పో రెనో 8. రెనో 8 ప్రొ సహా పలు ఒప్పో స్మార్ట్ఫోన్లను కనెక్ట్ చేస్తోంది.
రెనో, ఎఫ్ సిరీస్, కే సిరీస్లోని అన్ని 5జీ స్మార్ట్ఫోన్లకు ఒప్పో సాఫ్ట్వేర్ అప్డేట్ను అందిస్తోంది. ఇక ఒప్పో రెనో 8. ఒప్పో రెనో 8 ప్రొ, ఒప్పో రెనో 7, ఒప్పో ఎఫ్21 ప్రొ 5జీ, ఒప్పో ఎఫ్19 ప్రొ, ఒప్పో కే10, ఒప్పో ఏ53 డివైజ్ల సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ను చేపట్టగా ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్లు జియో 5జీ నెట్వర్క్కు కనెక్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
నవంబర్ చివరినాటికి మిగిలిన 5జీ డివైజ్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయనుంది. ఒప్పోతో పాటు వన్ప్లస్, నథింగ్ ఫోన్ వంటి ఇతర స్మార్ట్ఫోన్ బ్రాండ్లు జియో, ఎయిర్టెల్ 5జీతో 5జీ కనెక్టివిటీ కోసం సాఫ్ట్వేర్ అప్డేట్స్తో ముందుకొచ్చాయి. జియో, ఎయిర్టెల్ 5జీ సపోర్ట్ కోసం శాంసంగ్, షియామి, రియల్మి సైతం సాఫ్ట్వేర్ అప్డేట్ చేపట్టాయి. ఇక వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ, నార్డ్ 5జీ, 10టీ సహా ఇతర ఫోన్లు జియో 5జీ నెట్వర్క్ సపోర్ట్ కోసం అప్డేట్ను రిసీవ్ చేసుకున్నాయి.