విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
సన్నబియ్యం పంపిణీ చేయాలి: మంత్రి గంగుల
నాలుగు రోజుల్లో మున్సిపల్ సిబ్బందికి టీకాలు అందించాలి:మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అరవింద్కుమార్
ప్రభుత్వ సూచనలు పాటిస్తాం: కలెక్టర్ శర్మన్
నాగర్కర్నూల్ టౌన్, ఏప్రిల్ 9: కొవిడ్ కారణంగా మూతబడిన ప్రైవేట్ పాఠశాలలు పు నఃప్రారంభమయ్యే వరకు ఉపాధ్యాయు లు, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అం డగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉద యం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సి బ్బందికి ఆర్థికసాయం విధివిధానాలపై స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మం త్రి సబిత మాట్లాడుతూ స్కూళ్లు పునఃప్రారంభించే వరకు ప్రతి ఉపాధ్యాయుడు, బోధనేతర సిబ్బందికి రూ.2వేల చొప్పున ఆర్థికసాయం, 25కిలోల బియ్యం, ఉచితం గా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చే యాలన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని వి ధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి ఆర్థికసాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. పౌరసరఫరాల శా ఖ మంత్రి గంగుల మాట్లాడుతూ పౌర సరఫరాల అధికారులు సమన్వయంతో పనిచే సి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ టీ చర్లు, బోధనేతర సిబ్బందికి చౌకధర దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి చర్య లు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ముఖ్య స లహాదారుడు రాజీవ్శర్మ మాట్లాడుతూ జి ల్లావ్యాప్తంగా ఎన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉ న్నాయి? అందులో బోధన సిబ్బంది ఎంత మంది? బోధనేతర సిబ్బంది ఎంత మం ది? అనే వివరాలను 15వ తేదీలోగా సేకరించి 18వ తేదీలోగా తమకు సమర్పించాలన్నారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అరవింద్కుమార్ మాట్లాడుతూ నాలుగు రోజుల్లో మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ నుంచి కా ర్మికుడి వరకు కొవిడ్ వ్యాక్సిన్ అందించేలా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వయస్సుతో సంబంధం లేకుండా మున్సిపల్శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సందీప్కుమార్ సుల్తానియా మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో పనిచేసే గ్రామ పంచాయతీ సిబ్బంది వందశాతం వ్యాక్సిన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 161 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా అందులో 1,575 మంది ఉపాధ్యాయులు, 120 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారన్నారు. క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలు త్వరలోనే సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ లబ్ధిదారులకు రూ.2వేల ఆర్థికసాయంతోపాటు 25కిలోల బియ్యం అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, పౌరసరఫరాల అధికారి మోహన్బాబు, ఈఎస్వో బాలరాజు, ఎంఈవోలు పాల్గొన్నారు.