షాబాద్, మే 1 : మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బుధవారం షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ నాలుగు నెలల పాలనలో కరెంట్, నీళ్ల సమస్యలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, మాజీ జడ్పీటీసీ రాజేందర్గౌడ్, మాజీ సర్పంచ్ వెంకట్యాదవ్, మాజీ ఎంపీటీసీ సత్యం, బీఆర్ఎస్ నాయకులు శ్రీను, ఆరీఫ్, అంజయ్య, వెంకటయ్య, సురేశ్ముదిరాజ్, కృష్ణయ్య, రామకృష్ణ, పరుశావేది, మల్లేశ్, సయ్యద్ ఇబ్రహీం, ఇమ్రాన్, ఎండీ ముఖ్రంఖాన్, రామచందర్, హరికుమార్, సత్యం, జంగయ్య, రవి, సాయిచరణ్గౌడ్, హరీశ్, శ్రీశైలం, శేఖర్, వెంకటేశ్, శ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : మండల కమ్మెట, గొల్లగూడ గ్రామాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, బీఆర్ఎస్ మండల బీసీసెల్ అధ్యక్షుడు రాములు,
మాజీ ఎంపీపీ మంగళి బాల్రాజ్, కమ్మెట, గొల్లగూడ, అంతారం మాజీ సర్పంచ్లు తులసిరాజు, రాంచంద్రయ్య, సులోచనాఅంజన్గౌడ్, సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు శేరిశివారెడ్డి, వ్యసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివనీలచింటూ, వ్యసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, కురుమ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్, మాజీ ఉప సర్పంచ్ స్వర్ణలతాభాస్కర్, ఇనాయత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మహేశ్, నాయకులు రామాగౌడ్, ఎల్లన్న, శేరి రాజు, విఠల్రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
మొయినాబాద్ : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా బుధవారం బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో కనకమామిడి, సజ్జన్పల్లి గ్రామాల్లో గడప గడపకూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోంపల్లి అనంతరెడ్డి ప్రచారానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను ఇచ్చిందని ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, బీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి నర్సింహగౌడ్, ఉపాధ్యక్షుడు జయవంత్, రావూఫ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గణేశ్రెడ్డి, మాజీ ఎంపీటీసీ మాణిక్రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్లు వెంకట్రెడ్డి, రాజు, మాజీ ఉపసర్పంచ్ రాంరెడ్డి, నాయకులు తిరుపతిరెడ్డి, కాంతారెడ్డి, రమేశ్, బాలు, నర్సింహరెడ్డి, పద్యారావు, అరవింద్ పాల్గొన్నారు.
కొత్తూరు : మండల పరిధిలోని సిద్దాపూర్లో బీఆర్ఎస్ నాయుడు వడ్డె బాలయ్య ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఇంటింటికీ ప్రచారంలో కొత్తూరు మండల బీఆర్ఎస్ నాయకుడు దేవేందర్యాదవ్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో కొత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్ శ్రీనివాసులు, బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, జనార్దన్రెడ్డి, జైపాల్, మహేశ్ పాల్గొన్నారు.