యాచారం : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మండలంలోని మాల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు 100మీటర్ల జాతీయజెండాను ప్రదర్శించారు. నల్లవెల్లిలో ఎంపీపీ సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. మండల కేంద్రంతో పాటు తులేకుర్ధులో సీపీఎం మండల కార్యదర్శి మధుసూధన్రెడ్డి ఆధ్వర్యంలో సీపీఎం జెండాను నాయకులు ఎగరవేశారు. తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ నివాలులర్పించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నరేందర్గౌడ్, శివ, గణేష్, సీపీఎం నాయకులు అంజయ్య, నర్సింహ్మ, వినోద్, బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.