చేవెళ్ల రూరల్, డిసెంబర్ 5 : నియోజకవర్గ పరిధిలోని గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం చేవెళ్ల మండల పరిధిలోని దామరగిద్ద, ఇబ్రహీంపల్లి గ్రామాల్లో శుభోదయం కార్యక్రమంలో భాగంగా పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామని, ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా శుభోదయంలో తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని, ప్రభుత్వం గ్రామాలకు సరిపడా నిధులు మంజూరు చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నదన్నారు. రెండు గ్రామాల్లో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు, వినతులను దగ్గరున్న సంబంధిత అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ బేగరి నర్సింహులు, సర్పంచ్లు మంజుల, వెంకటేశం గుప్తా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, కౌకుంట్ల రైతు బంధు సమితి అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఎదిరె రాములు, సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేసారం శ్రీనివాస్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శేరి శివారెడ్డి, ఎంపీడీవో హిమబిందు, మిషన్ భగీరథ ఏఈ, విద్యుత్ ఏఈ జానీ, హస్తేపూర్ సర్పంచ్ వెంకటయ్య, రేగడిఘనాపూర్ సర్పంచ్ నర్సింహులు, మల్కాపూర్ ఎంపీటీసీ రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేత
శంకర్పల్లి : శేరిగూడ గ్రామానికి చెందిన కృష్ణకు రూ.3.50 లక్షల ఎల్వోసీ మంజూరైంది. లబ్ధిదారుడికి ఎమ్మెల్యే యాదయ్య అందజేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.