తెలంగాణ వచ్చాక జిల్లా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఈ క్రమంలో భూముల ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపు మీదున్నది. కాంగ్రెస్ వచ్చి ధరణిని తీసేస్తే..భూముల ధరలు పతనమవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం ఢమాల్ మంటుంది.
తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యతతో ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగి రాష్ట్రంలోనే జిల్లా తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో నిలిచింది.
తలసరి ఆదాయం ప్రామాణికంలో వ్యవసాయరంగం కూడా ఒక భాగమే. కాంగ్రెస్ వస్తే..వ్యవసాయం రంగం ఆగమాగమై తలసరి ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రస్తుతం భూములను కొనుక్కునే వారే తప్ప అమ్ముకునేవారు కరువయ్యారు. భూ హక్కులు సర్వం రైతులవే కావడంతో జిల్లా రైతాంగం కంటినిండా నిద్రపోతున్నది. కాంగ్రెస్ వస్తే సంక్షేమ పథకాలు బంద్ అవుతాయి. పటేల్ పట్వారీ వ్యవస్థ వచ్చి భూములు దళారులకు బోజ్యంగా మారుతాయి.
రంగారెడ్డి, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలో కొచ్చి ధరణి పోర్టల్ను తీసేస్తే జిల్లాకు అనేక రూపాల్లో భారీ నష్టం జరుగుతుందనేందుకు పైన పేర్కొనవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ధరణి పోర్టల్ కల్పించిన భరోసాతో గుంట భూమిని కూడా మనిషి తన ప్రాణం కంటే ఎక్కువగా భావించే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో భూయాజమాన్య హక్కులకే ఎసరు పెట్టే లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రజానీకానికి ఉరితాడును పేనుతున్నది. దీంతో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలు నీళ్లపాలవుతాయి. సంక్షేమ పథకాలు బంద్ అయి వలసలు షరా మామూలవుతాయి.
వ్యవసాయంపై ఆధారపడ్డ వివిధ రంగాలు కుంటుపడి ప్రజల జీవన ప్రమాణాలు సైతం తగ్గి ఆ ప్రభావం తలసరి ఆదాయంపై పడనున్నది. పరిశ్రమలు రాకపోవడంతో ఉపాధి అవకాశాలు సైతం దెబ్బతింటాయి. భూముల ధరలు సైతం పతనమై రియల్ ఎస్టేట్ వ్యాపారమూ దెబ్బతింటుంది. గెట్టుకాడ పంచాయుతీలు ఎక్కువై ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న జిల్లాలోని పల్లెలు, పట్టణాలు రావణకాష్టంలా మారుతాయి.
భూ సంస్కరణల్లో భాగంగా సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ‘ధరణి’తో జిల్లాలో వ్యవసాయం గాడినపడింది. ప్రతి భూమి, రైతు వివరాలను ధరణిలో నిక్షిప్తం చేశారు. ఈ వివరాల ఆధారంగానే రైతు బంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్లు, ఎరువులు, విత్తనాల సరఫరా వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. దీనికితోడు 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తుండడంతో జిల్లాలో సేద్యం లాభసాటిగా మారింది. తెలంగాణకు ముందు లక్ష ఎకరాల్లోనే ఉన్న సాగు పదేండ్లలో ఐదు లక్షల ఎకరాలకు పెరిగింది. దీంతో రైతులు భూములను నమ్ముకునే దుస్థితి నుంచి భూ మిని నమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.
భూములకు సైతం డిమాండ్ పెరుగడంతో లక్షల్లో అప్పులు ఉన్న రైతులు సైతం బెంగపడడం లేదు. అర ఎకరం అమ్ముకుంటే చాలు అప్పులన్నీ తీరిపోతాయన్న ధీమా తో ఆత్మహత్యలకు ఒడిగట్టడం వంటి ఘటనలకు పూనుకోవడం లేదు. కాంగ్రెస్ చెప్తున్నట్లు ధరణిని తీసేస్తే రైతులు దినదిన గండంగా బతకాల్సిన పరిస్థితులు వస్తాయి. పటేల్ పట్వారీ వ్యవస్థ మళ్లీ వచ్చి భూ హక్కులను కోల్పోవడం ద్వారా రైతుల బతుకులు మళ్లీ ఆగమవుతాయి. సంక్షేమ పథకాలన్నీ బంద్ అయి అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నిండా ముని గే పరిస్థితి వస్తుంది.
ధరణి పోర్టల్ వచ్చాక భూ వివరాలు ఆన్లైన్లోకి ఎంట్రీ అయ్యా యి. ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా తమ రికార్డులను ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు. విచక్షణాధికారాలను ప్రభుత్వం భూ యజమానులకే కట్టబెట్టింది. రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పెరిగి భూ ములు అమ్మిన వారికి, కొన్నవారికి ఓ భరోసా ఏర్పడింది. విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉన్నవారు, విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలకు కూడా భరోసా ఏర్పడింది. భూ యజమానికి తెలియకుండా క్రయవిక్రయాలు జరిపే అవకాశమే లేకపోవడంతో గుండెపై చేయి వేసుకుని నిద్రపోతున్నారు. ఒకవేళ ధరణి పోర్టల్ను ఎత్తివేస్తే..పాత రాత పద్ధతి అమలులోకి వచ్చి అవినీతి, అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతుంది.
రాత్రికి రాత్రే యాజమాన్య హక్కులు రికార్డుల్లో మారిపోతాయి. డబుల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్లూ కోకొల్లలుగా జరుగుతాయి. రూ.కోట్ల విలువైన భూమిని వదిలేసి ఉద్యోగ, ఉపాధి పరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ధైర్యం ఉండదు. లంచాలు, పైరవీలు పెరిగిపోయి దళారులదే రాజ్యంగా మారుతుంది. మరోపక్క కాంగ్రెస్ తెస్తామంటున్న కౌలు చట్టంతో భూ యజమానుల హక్కులకు ఎసరు వస్తుండడంతో ఏ ఒక్క రైతు కూ డా తన భూమిని కౌలుకు ఇచ్చేందుకు ముందుకు రాడు. కాంగ్రెస్ కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామంటుండడంతో దీనిని సాకుగా చూపి రైతు, కౌలుదారు నుంచి ఎక్కువ మొత్తం కౌలు వసూలు చేయడం వల్ల కౌలుదారు కూడా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి దాపురిస్తుంది.
తెలంగాణ ఏర్పడే నాటికి ఆర్థిక వృద్ధిలో రంగారెడ్డి జిల్లా పరిస్థితి దయనీయంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వృద్ధి రేటు పెరిగి 2019-20 సంవత్సరం నాటికే 17.2 శాతానికి పెరిగింది. అలాగే జిల్లాలో 2014-15లో తలసరి ఆదాయం రూ.2.83లక్షలు ఉంటే 2022-23 సంవత్సరానికి తలసరి ఆదాయం గణనీయంగా రూ. 6.25 లక్షలకు పెరిగి దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో జిల్లా నిలిచింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాలో రూ.47,062 కోట్ల పెట్టుబడులతో 1,252 పరిశ్రమలు ఏర్పాటై 5.15లక్షల మం దికి ఉపాధి కలిగింది. స్వరాష్ట్రంలో జిల్లా పరిశ్రమల స్థాపన (45 శాతం)లో, పెట్టుబడుల(1.41శాతం)లో, ఉపాధి(1.1శాతం)లో పెరుగుతల నమోదైంది.
సీఎం కేసీఆర్ జిల్లాలో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేయడంతోపాటు రోడ్లు, విద్యుత్తు, తాగు, సాగు నీరు, కరెంటు వంటి వసతులతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తులకు పునరుజ్జీవం కల్పించడం, వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెచ్చి ఆ రంగాన్ని బలోపేతం చేయడం వంటి ఆర్థి క కార్యకలాపాలకు సంబంధించిన కార్యక్రమాలతో జిల్లా ఆర్థిక వృద్ధ్ది గణనీయంగా పెరుగనున్నది. 3 గంటల కరెంటు, ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్ ప్రకటనలు ఆచరణలోకి వచ్చాక భూముల ధరలు తగ్గి అన్ని రంగాలపై ప్రభావం చూపడం వల్ల జిల్లా ఆర్థిక వృద్ధి కూడా దెబ్బతినే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల బతుకులు ఆగమవుతాయి. భూముల ధరలు తగ్గుతాయి. అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది. ధరణి స్థానంలో భూమాత అనే పోర్టల్ను తీసుకొస్తే అది నాయకులకు భూమేతగా మారనున్నది. ధరణి లేకపోతే మళ్లీ దళారులు రాజ్యమేలుతారు. కాంగ్రెస్ కౌలు రైతులకు నూతన చట్టం తీసుకొస్తామంటున్నది. దాంతో భూయజమానులు, కౌలు దారుల మధ్య గొడవలు జరుగుతాయి. ఇలా అన్ని ప్రకటనలు చేస్తూ రైతులను అయోమయంలోకి గురి చేసే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావొద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్నదాతలకు మేలు. నా ఓటు సీఎం కేసీఆర్కే.
– వీరాంజనేయులు, రైతు, అంతారం గ్రామం (చేవెళ్ల రూరల్)
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. కొన్నేండ్లుగా ఉన్న భూసమస్యలను పరిష్కరించేందుకే ధరణి పోర్టల్ను తీసుకొచ్చారు. దీంతో అన్నదాతల భూములకు భద్రత ఏర్పడింది. చాలావరకు భూసమస్యలు తగ్గాయి. అంతేకాకుం డా రైతుబంధు వస్తుండటంతో పంటలను అప్పుల్లేకుండానే సా గు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజ లు, రైతుల బతుకులు ఆగం అవుతాయి. రైతులు ఉపాధి లేక వలస కూలీలుగా మార్చాల్సి వస్తుంది. సాగు విస్తీర్ణం తగ్గి ఆహార ధరలు పెరుగడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతుంది. అందువల్ల అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పక్షాన ప్రజలు నిలువాలి. కారుగుర్తుకు ఓటేస్తే నే మరింత అభివృద్ధి సాధ్యం. నా ఓటు సీఎం కేసీఆర్కే.
-చీపిరి రమేష్యాదవ్, సోలీపూర్(షాద్నగర్టౌన్)
కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోతుంది. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్లు, ఎరువులు, విత్తనాల సరఫరా వంటి సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాలను ఆదుకుంటున్నది. దీనికితోడు 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తుండడంతో జిల్లాలో సేద్యం లాభసాటిగా మారింది. ప్రజలందరూ మూడు పంటలను సాగు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి. రియల్ ఎస్టేట్ ఢమాల్ మంటుంది. మూడు గంటల కరెంట్తో ఒక్క మడి కూడ తడవని పరిస్థితి నెలకొంటుంది. 10 హెచ్పీ మోటర్లు కొనాలంటే సన్న, చిన్నకారు రైతులకు ఆర్థికంగా మారుతుంది. ధరణిని తీసేసి భూమాత పోర్టల్ను తీసుకొస్తే మళ్లీ భూముల పంచాయితీలు పెరుగుతాయి. అంతేకాకుండా రైతుబంధు రద్దవుతుంది. రైతులను ఇబ్బందులకు గురి చేసే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వద్దే..వద్దు. ప్రజలు, అన్నదాతలకు అండగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే నా ఓటు.
-గుర్రం సుధాకర్రెడ్డి, రాందాస్పల్లి( ఆదిబట్ల)
కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి. మూడు గంటలు ఇస్తారా.. 7 గంటలు ఇస్తారా..?అనే విషయంలో ఆ పార్టీ నాయకులకే గ్యారెంటీ లేదు. దీంతో వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను తీసుకొస్తే అవినీతి పెరిగిపోతుంది. మళ్లీ పటేల్ పట్వారీల వ్యవస్థ వస్తుంది. మధ్యవర్తులు రాజ్యమేలుతారు. సీఎం కేసీఆర్ వచ్చిన త ర్వాత వ్యవసాయం లాభసాటిగా మారింది. దీంతో అన్నదాతలు మూడు పంటలను సాగు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ప్రభుత్వ పథకాలతో అన్ని వర్గాలను ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే నా ఓటు. ప్రజలు, రైతులు కూడా ఆదరించి ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలి. కాంగ్రెస్ వస్తే అన్ని పథకాలు కట్ అవుతాయి.
-నర్సింహయాదవ్, రైతు, కొండన్నగూడ , ఫరూఖ్నగర్ మండలం
కాంగ్రెస్తో జిల్లాలో అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో జిల్లా అన్ని రంగాల్లోనూ ముందున్నది. ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ప్రజల జీవన ప్రమాణాల స్థాయీ పెరిగింది. దేశ, విదేశాల కంపెనీలు, సం స్థలు ఏర్పాటు కావడంతో స్థానికులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రశాంతంగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్న రాష్ర్టాన్ని రాక్షసుల పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుని తెలంగాణ రాష్ర్టాన్ని రైతు రాజ్యంగా మార్చుకుందాం.
– ఏజాస్, శంకర్పల్లి
కాంగ్రెస్ను గెలిపిస్తే దళారులదే రాజ్యం అవుతుంది. గతంలో ఎక్కడ చూసినా భూ సమస్యలు ఉండేవి. పేరు మార్చాలన్న.. పట్టా కావాలన్నా దళారుల వద్దకు వెళ్లాల్సిందే. వాళ్లు చెప్పినంత డబ్బులిచ్చి పని చేయించుకునే దుస్థితి ఉండేది. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే పరిస్థితుల్లో మార్పువచ్చింది. ధరణి పోర్టల్తో భూసమస్యలు చాలా వరకు తగ్గాయి. వ్యవసాయానికి 24 గంటల కరెంట్తో పండుగలా మారింది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. కాంగ్రెస్ వస్తే ధరలు ఢమాల్ మంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా తగ్గుతుంది. ఇంత మంచి కార్యక్రమాలతో రాష్ర్టాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కే నా ఓటు. కాంగ్రెస్ను గెలిపిస్తే అంతే..
-సయ్యద్ ఖలీల్, ఆమనగల్లు మున్సిపాలిటీ
కాంగ్రెస్ రాజ్యం వస్తే సబ్బండ వర్ణాల బతుకులు ఆగమవుతాయి. కష్టపడి సాధించుకున్న తెలంగాణను అందరి అంచనాలకు మిన్నగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కర్ణాటక తరహాలో మూడు గంటల విద్యుత్తు సమస్యతోపాటు భూ సమస్యలు పెరుగుతాయి. పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తుంది. సంక్షేమ పథకాలన్నీ బంద్ అవుతాయి. రియల్ ఎస్టేట్ తగ్గుతుంది. కౌలు రైతుకు పెట్టుబడి సాయాన్ని అందిస్తే భూయజమానికి, కౌలు రైతుకు మధ్య పంచాయితీలు జరుగుతాయి. మన బతుకులు మరింత బాగుపడాలంటేనే సీఎం కేసీఆర్తోనే సాధ్యం. నా ఓటు కారు గుర్తుకే.
-అశోక్, షాద్నగర్రూరల్
ధరణితో రైతుల భూములకు భద్రత పెరిగింది. గతంలో ఉన్న పట్వారీ వ్యవస్థతో అన్నదాతలు చాలా ఇబ్బందిపడ్డారు. పైరవీకారులు, దళారులదే రాజ్యం గా ఉండేది. పైసలిస్తేనే రెవెన్యూ అధికారులు పనిచేసేది. ఒకరి భూమిని మరోవ్యక్తి పేరున తారు మారు చేశారు. పాత విధానం వస్తే రైతుల ప్రమే యం లేకుండానే రికార్డుల్లోని భూము లు మరొకరి పేరున రిజిస్ట్రేషన్ అవుతాయి. దీం తో తరచూ భూసమస్యలు, వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ధరణి పోర్ట ల్ ద్వారా భూరికార్డులు తారుమా రు కాకుండా పక్కగా ఉన్నాయి. రైతులకు ధరణి అండగా మారింది. ఈ పోర్టల్ ద్వారా అక్రమాలకు తావులేదు.
-చంద్రశేఖర్రెడ్డి, ఉద్యోగి,రైతు,తుర్కయంజాల్ మున్సిపాలిటీ
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో మా భూములకు భరోసా కలిగింది. రిజిస్ట్రేషన్లు త్వరగా జరుగుతున్నాయి. 15 రోజుల్లోనే పాస్బుక్ ఇంటికి వస్తున్నది. ఎవరికి లంచం ఇవ్వాల్సిన పనిలేదు. నా పేరిట ఉన్న భూమికి నేను సంతకం, వేలు ముద్ర పెడితే తప్ప ఇంకొకరికి మారదు. ఇది చాలా మంచి పద్ధతి. పట్వారీ, వీఆర్వోలు ఉన్నప్పుడు ఒకరి భూమి మరొకరికి ఇష్టమచ్చినట్లు మార్చేవారు. ఇప్పుడు అట్లా లేదు. ధరణితో మంచి జరిగింది.
– కంతి దయాకర్, రాందాస్పల్లి( ఆదిబట్ల)
ధరణితో భూసమస్యల్లేవు. ఒకేసారి రిజిస్రేష్టన్, మ్యుటేషన్ ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తవుతున్నది. పారదర్శకం గా సేవలు అందుతున్నాయి. అధికారు లు, కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు. అరగంటలోనే రిజిస్ట్రేషన్, మ్యు టేషన్ పూర్తి చేసి పట్టా పాస్బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలను అందిస్తున్నారు. ధర ణి వచ్చిన తర్వాత రైతుబంధు, రైతుబీమా అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. భూసమస్యలకు ధరణితో మేలు జరుగుతుంది. కాంగ్రెసోళ్లు ధరణిని రద్దు చేసి భూమాత పోర్టల్ను తీసుకొస్తే రైతుల జీవితాలు ఆగమవుతాయి. మళ్లీ రైతులకు పాత రోజులే వస్తాయి.
-ఏనుగు బుచ్చిరెడ్డి, ఇబ్రహీంపట్నంరూరల్
ధరణిని తీసివేస్తే భూములకు రక్షణ కరువవుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణితోనే రైతుల భూములు భద్రంగా ఉంటాయి. చాలా వరకు భూముల సమస్యలు సమసిపోయాయి. పది నిమిషాల్లోనే భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని తొలగించి దాని స్థానంలో భూమాత తీసుకొస్తామంటున్నారు. ఈ పోర్టల్తో మళ్లీ పాత సమస్యలు పునరావృతమవుతాయి. మధ్యవర్తుల ప్రమేయం పెరుగుతుంది. భూరికార్డులను తారుమారు చేసి రైతుల మధ్య సమస్యలు సృష్టించి సొమ్ము చేసుకునేందుకు వీలు కలుగుతుంది. రెవెన్యూ వ్యవస్థలో దళారీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ను నమ్మితే రైతులు అరిగోసపడతారు. అందువల్ల అన్నదాతలను అండగా ఉన్న సీఎం కేసీఆర్కు నా మద్దతు. బీఆర్ఎస్ అభ్యర్థికే నా ఓటు.
– గురిగళ్ల రామచంద్రయ్య, కడ్తాల్ మండలం
తెలంగాణ ప్రభుత్వం తెచ్చి న ధరణి పోర్టల్ అద్భుతం గా ఉన్నది. ఈ పోర్టల్తో భూములకు భద్రత కలుగడంతో రైతుల్లో ధైర్యం పెరిగింది. ఎలాంటి పైరవీలు లేకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో రెవెన్యూ వ్యవస్థలో దళారులకు పనిలేకుండా పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ధరణి ని తద్దు చేస్తే మళ్లీ భూసమస్యలు ప్రారంభమవుతాయి. భూమాత పోర్టల్లో కౌలు రైతుల కాలమ్ చేరిస్తే పట్టాదారులు నష్టపోతారు. భవిష్యత్లో పట్టాదారుడికి, కౌలు రైతుల మధ్య ఎన్నో సమస్యలు వచ్చే ఆస్కారం ఉన్నది. కౌలు రైతులకు రైతుబంధు ఇచ్చి భూయజమానికి ఇవ్వకపోతే.. పట్టాదారులు భూములను రైతులకు కౌలు కు ఇవ్వరు. దాంతో కౌలుదారులు వలస వెళ్లాల్సి వస్తుంది. కాంగ్రెస్ నాయకులు ప్రకటిస్తున్న హామీలను రైతులు, ప్రజలు నమ్మే స్థితి లో లేరు.
– లాయక్అలీ, పట్టాదారు రైతు, కడ్తాల్
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణిని తొలగిస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి. అన్నదాతలకు ఇబ్బందులు తప్పవు. భూసమస్య లు ఉండొద్దన్న ఉద్దేశంతోనే ముఖ్యమం త్రి ఈ పోర్టల్ను తీసుకొచ్చారు. దీంతో చాలావరకు భూముల సమస్యలు తప్పాయి. మధ్యవర్తులు, దళారుల బెడద లేకుండా పోయిం ది. రైతులను ఇబ్బందులకు గురి చేయాలనుకుంటున్న కాంగ్రెస్ వచ్చే ది లేదు.. రైతులకు ఏమి చేసేది లేదు..తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్ఎస్దే అధికారం. చెన్నయ్య, రైతు బోడంపహాడ్ షాబాద్ పక్కాగా భూముల రికార్డులు ధరణితో వ్యవసాయ భూముల రికార్డులు పక్కాగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరో వచ్చి మా భూముల కాగితా లు తారుమారు చేస్తారన్న భయం కూడా లేదు. గతంలో రికార్డుల మార్పు కోసం ఊరి పెద్దమనుషు లు, చుట్టుపక్కల రైతులు, నాయకులు, పట్వారీలు, తహసీల్దారను బతిమాలి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్యే లేదు.
-చంద్రకాంత్ రైతు జాపాల, మంచాల
ధరణితోనే రైతులకు మేలు జరుగుతున్నది. ఈ పోర్టల్ వచ్చినప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగడం తప్పింది. లంచాల బెడద పోయింది. 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయి పాసు పుస్తకం కూడా వస్తున్నది. ధరణిని రద్దు చేస్తే రైతులకు తిప్పలు మొదలవుతాయి. కాంగ్రెసోళ్లు ధరణి పోర్టల్ను రద్దు చేస్తామన్నడం మూర్ఖత్వమే అవుతుంది. ఆ పార్టీతో అన్నీ ఇబ్బందులే ఉం టాయి. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు. బీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం. నా ఓటు సీఎం కేసీఆర్కే.
-వస్పుల శ్రీరామ్, ఆమనగల్లు మున్సిపాలిటీ 5వ వార్డు
ధరణిని తీసేస్తే మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో తండ్రి నుంచి కొడుకుకు వారసత్వంగా వచ్చిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్ చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఐదు నిమిషాల్లోనే తహసీల్ కార్యాలయాల్లో పనులు పూర్తవుతున్నాయి. భూమి పట్టా అయినట్టు కూడా కాగితాలను ఇస్తున్నా రు. ధరణిని తీసేసి ప్రజలను ఇబ్బందులు పెట్టాలని చూసే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానియొద్దు. బీఆర్ఎస్తోనే అన్ని న్యాయం జరుగుతుంది. నా ఓటు కేసీఆర్కే.
– నరహరిరెడ్డి , దేవరంపల్లి గ్రామ సర్పంచ్, రైతు