వికారాబాద్, జనవరి 23 : సంక్షేమ సిరులు ప్రతి ఇంటికీ ఏదో రూపంలో అందుతున్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. సోమవారం పట్టణానికి చెందిన కల్యాణక్ష్మి షాదీముబారక్ లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. 111 మంది లబ్ధిదారులకు రూ. 1,11,12,876లు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంపదను సంక్షేమం రూపంలో ప్రతి ఇంటికీ పంపిస్తున్నటువంటి ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఆడ పిల్లల తల్లిదండ్రులకు మంచి భరో సాను నింపారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, కౌన్సిలర్లు పుష్పలతారెడ్డి, అనంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఎల్ఎఫ్ క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
క్యాంపు కార్యాలయం ముందు ఎమ్మెల్యే ఆనంద్ టీఎల్ఎఫ్ 2023 నూ తన క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పుష్పల తా రెడ్డి, టీఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు, వికారాబాద్ కార్యదర్శి గోపాల్, వికాస్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అంబేద్కర్ పారామెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ స్వామి, విశ్వ భారతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్రెడ్డి, అధ్యాపకులు శ్రీనివాస్రెడ్డి, సాయి, రవి, మహేందర్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.