షాద్నగర్, నవంబర్ 28: టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీని మరింత అభివృద్ధి చేయడానికి సైనికుల్లాగా కష్టపడాలని, కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం షాద్నగర్ మున్సిపాలిటీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులకు టీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. సంక్షేమ పథకాలను గడపగడపకూ చేర్చాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని గృహం లేదన్నారు. ప్రజల సంక్షేమ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని అన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, బచ్చలి నర్సింహులు, శ్రీనివాస్, అంతయ్య, సర్వర్పాషా, కృష్ణవేణి, నాయకులు శంకర్, నందకిశోర్, యాదగిరి, రాజావరప్రసాద్, రఘునాథ్, సలీం, శేఖర్, చెన్నయ్య, శ్రీను, రమేశ్ పాల్గొన్నారు.
కార్యకర్తలు కంకణ బద్ధ్దులై పనిచేయాలి
ఇబ్రహీంపట్నంరూరల్ : పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలు కంకణ బద్ధులై పనిచేయాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని రాయపోల్, ముకునూ రు, కప్పాడు గ్రామాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ..పార్టీని బలోపేతం చేయటం కోసం కార్యకర్తలు ప్రభుత్వం పేదప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. సమావేశంలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్రెడ్డి, నాయకులు బాలుగౌడ్, గొర్రెంకల శ్రీనివాస్, ఉడుతల జలందర్, సర్పంచ్లు బల్వంత్రెడ్డి, జ్యోతిరాజు, హంసమ్మ, ఎంపీటీసీలు జ్యోతి, అచ్చన శ్రీశైలం, సహకార సంఘం చైర్మన్ వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ ఈశ్వర్, ఉపసర్పంచ్ బాలరాజు, కృష్ణ పాల్గొన్నారు.
కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు
కేశంపేట: పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్రెడ్డి అన్నారు. సోమవారం సంతాపూర్, అల్వాల, ఇప్పలపల్లి, చింతకుంటపల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని, పార్టీని మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం 100 మంది ప్రజలకు బూత్ను ఏర్పాటు చేసి, బూత్ కమిటీ సభ్యులను నియమించారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు శ్రీలత, ఆంజనేయులు, పార్వతమ్మ, నవీన్కుమార్, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, ఎంపీటీసీలు మల్లేశ్యాదవ్, మంజుల, నాయకులు ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, కృష్ణయ్య, రమేశ్యాదవ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా..
కొత్తూరు : టీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్, సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ అన్నారు. మండల పరిధిలోని ఎస్బీపల్లిలో కార్యకర్తల ముఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశం లో టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పెంటనోళ్ల యాదగిరి, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు కడాల శ్రీశై లం, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కుమ్మరిగూడెం పాండు, నాయకులు ఎమ్మె నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
నందిగామ : పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకూ తగిన గుర్తింపు లభిస్తుందని ఎంపీపీ రవీందర్యాదవ్ అన్నారు. నందిగామ మండలం చేగూరు గ్రామంలో సోమవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీలో కొత్త, పాత అని తేడాలేకుండా నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, నాయకులు శ్రీశైలం, భాస్కర్, సురేశ్, యాదయ్య, రవి, శేఖర్, మధు తదితరులు పాల్గొన్నారు.