సబ్బండ వర్ణాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేంద్రంలోని బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను రాష్ట్ర సర్కార్ నెరవేరుస్తున్నదన్నారు. గౌడల పింఛన్ కోసం ప్రభుత్వం 130 కోట్లను కేటాయిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ గౌడలకు మద్యం దుకాణాల కేటాయింపులో 15 శాతం కోటా కేటాయించారన్నారు. కులకచర్లలో గౌడ సంఘం భవన నిర్మాణానికి తన ఎమ్మెల్సీ నిధుల కింద 10లక్షలు మంజూరు చేస్తానని తెలిపారు. గౌడలను బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ గోల్కొండ సింహంగా పేరు పొందిన పాపన్నగౌడ్ పౌరుషానికి ప్రతీక అని అన్నారు. ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ కులకచర్లలో గౌడ సంఘం భవన నిర్మాణానికి 10 గుంటల భూమి కేటాయించి భవన నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేస్తానన్నారు.
– కులకచర్ల, సెప్టెంబర్ 11
కులకచర్ల, సెప్టెంబర్ 11 : మహనీయుల కలల ను ప్రభుత్వం సాకారం చేస్తున్నదని సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పి.మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేం ద్రంలోని బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్నగౌడ్ వి గ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, గౌడ సంఘం మండల అధ్యక్షుడు కృష్ణయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి రాములు, గౌడ సం ఘాల నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. గౌడన్నల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రభుత్వం వారి అభివృద్ధికి అనుక్షణం కృషి చేస్తున్నదని తెలిపారు.
పౌరుషానికి ప్రతీక సర్వాయి పాపన్నగౌడ్
చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ సర్వాయి పాపన్నగౌడ్ పౌరుషానికి ప్రతీక అని అన్నారు. చిన్నతనం నుంచే పోరాట పటిమను కలిగి ఉన్న ఆయన దాదాపు 20కి పైగా కోటలను గెలిచి గో ల్కొండ సింహంగా పేరు పొందారన్నారు. ఆయ న స్ఫూర్తి ఆదర్షనీయమని, వెనుకబడిన వర్గాల్లో పుట్టిన తెలంగాణ లెజెండ్ అంటూ కొనియాడారు. సీఎం కేసీఆర్ పాపన్నగౌడ్ స్ఫూర్తితోనే తె లంగాణ రాష్ర్టాన్ని సాధించారన్నారు. ఖిలాషాపూర్లో పాపన్నగౌడ్ కోట నిర్మాణం కోసం కోటి రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నా రు. గౌడ కులస్తులు వృత్తితో పాటు వారి పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని అన్నారు. గౌడ కులస్తులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
గౌడ సంఘ భవన నిర్మాణానికి రూ.10లక్షలు
కులకచర్లలో గౌడ సంఘం భవన కోసం 10 గుం టల భూమిని కేటాయించి నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు. గౌడకులస్తులకు ఫించన్తో పాటు ఎక్స్గ్రేషియాను కూ డా అందిస్తున్నదని తెలిపారు. గ్రామాల్లో గౌడ సంఘాలు ఉన్న చోట్ల 5 ఎకరాల భూమిని కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నా రు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, టీఎస్ఈడబ్ల్యూ, ఐడీసీ మాజీ చైర్మన్ నాగేందర్గౌడ్, గౌడ సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్నగౌడ్, ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్నాయక్, కులకచర్ల సర్పంచ్ సౌమ్యావెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమి టీ చైర్మన్ హరికృష్ణ, ఏపీసీఎస్ వైస్చైర్మన్ నాగరాజు, రై తు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు అనిల్రెడ్డి, వివిధ పార్టీల నాయకులు ఆంజనేయులు, భీంరెడ్డి, హ న్మంతు, గౌడ సంఘం నాయకులు రాఘవేందర్గౌడ్, జోగు వెంకటయ్యగౌడ్, వెంకటయ్యగౌ డ్, అంజిలయ్యగౌడ్, ఆంజనేయులు, కొండయ్యగౌడ్, బాలముకుందం, వివిధ గ్రామా ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో..
సర్వాయి పాపన్నగౌడ్ 12మందితో ప్రారంభించిన తన యుద్ధాన్ని 12వేల మందితో తన లక్ష్యాన్ని పూర్తి చేశారని, సీఎం కేసీఆర్ కూడా అదే లక్ష్యంతో రాష్ట్రంలో పని చేస్తున్నారని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. తెలంగాణను సాధించిన నాటి నుంచి రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తూ సబ్బండ వర్ణాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపా రు. గౌడ కులస్తులకు రూ.130 కోట్ల్ల పింఛన్ అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గతంలో చాలామంది గౌడ కులస్తులు కల్లు, సారా జీవనోపాధిగా ఉండేదనే విషయాన్ని గుర్తించిన సీఎం వారికి మ ద్యం దుకాణాల కేటాయింపులో 15 శాతం కోటా కేటాయించిందన్నారు. దీన్ని మరింత గా పెంచాలని డిమాండ్ వసున్నదని ఈ విషాయన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కులకచర్లలో గౌడ సంఘం భవన ని ర్మాణానికి తన ఎమ్మెల్సీ నిధుల ద్వారా రూ.10లక్షల నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఎక్కడైతే సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలు పెడితే అక్కడ తన నిధుల నుంచి రూ.5లక్షల సహాయం అందిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గౌడ కులస్తుల ను అన్ని విధాలుగా ఆదుకుంటున్నదని అన్నారు. 15 శాతం రిజర్వేషన్ను 50 శాతానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.