కొత్తూరు, జవవరి 30 : కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధికోసం రూ. 32.52 కోట్లు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మున్సిపాలిటీలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. కొత్తూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి పార్టీలకతీతంగా కౌన్సిలర్లు సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీల కోసం ఈ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మున్సిపాలిటీ పాలకవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు అవసరమో గుర్తించాలని సూచించారు.
అనంతరం నిధులు మంజూరు కావడానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు మున్సిపల్ పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది. సమావేశంలో వైస్ చైర్మన్ డోలి రవీందర్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, కౌన్సిలర్లు నర్సింహాగౌడ్, సోమ్లానాయక్, నాయకులు బీఆర్ఎస్ నాయకులు దేవేందర్యాదవ్, ఎమ్మె సత్యనారాయణ, సుదర్శన్గౌడ్, శ్రీనివాస్గౌడ్, గోపాల్గౌడ్, వీరమోని దేవేందర్, లక్ష్మయ్య, ఆంజనేయులు, దేవేందర్గౌడ్ పాల్గొన్నారు.
నవగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
కొత్తూరు ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా జరిన పూజలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పూజలు చేశారు.