ఇబ్రహీంపట్నం, జనవరి 25 : ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు అని ఆర్డీవో వెంకటాచారి అన్నారు. జాతీయ ఓటరు నమోదు దినోత్సవంలో భాగంగా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయం నుంచి ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఓటు విలువను అధికారులు, ప్రజాప్రతినిధులు వివరించారు. ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞచేయించారు. అనంతరం ఓటరుగా నమోదు చేసుకున్న యువతీ యువకులకు ఓటర్కార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ఎంపీడీవో జైరాంవిజయ్, తహసీల్దార్ రామ్మోహన్రావు, పంచాయతీరాజ్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఆర్ఐ కృష్ణ, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటు హక్కు వజ్రాయుధం
షాద్నగర్టౌన్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని ఆర్డీవో రాజేశ్వరి అన్నారు. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వరకు అధికారులు ర్యాలీ నిర్వాహించారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, తహసీల్దార్ గోపాల్, ఎంపీడీవో వినయ్, కమిషనర్ వెంకన్నతో కలిసి మానవహారంగా ఏర్పడిన అనంతరం ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో లక్ష్మణ్నాయక్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శంకర్పల్లి : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తహసీల్దార్ నయీమొద్దీన్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కార్యాలయం ఆవరణలో ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య, ఉప తహసీల్దార్ ప్రియాంక, సీనియర్ అసిస్టెంట్ పవన్, ఆర్ఐలు విక్రమ్రెడ్డి, తేజ పాల్గొన్నారు.
కడ్తాల్ : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, ఎన్నికల్లో ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. మండల వ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీవో రామకృష్ణ, డీటీ వినోద్, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ లాయక్అలీ, పీఏసీఎస్ డైరెక్టర్లు సేవ్యానాయక్, సర్పంచ్ యాదయ్య, యువజన సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రాఘవేందర్, హెచ్ఎం జంగయ్య పాల్గొన్నారు.
ఓటు నమోదు చేసుకోవాలి
చేవెళ్లటౌన్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ఆర్డీవో వేణుమాధవ రావు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణ సమీపంలో మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటి తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీడీవో రాజ్కుమార్, ఆర్ఐ రాజేశ్, డివిజన్ ఏవో, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
షాబాద్లో..
షాబాద్ : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఓటు హక్కును స్వచ్ఛంధంగా ఉపయోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సైదులుగౌడ్, డిప్యూటీ తహసీల్దార్ మధు, సీనియర్ అసిస్టెంట్ కృష్ణయ్య, సిబ్బంది తదితరులున్నారు.
కేశంపేటలో..
కేశంపేట : మండల కేంద్రంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీపీ రవీందర్యాదవ్ సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, సర్పంచ్లు వెంకట్రెడ్డి, నవీన్కుమార్, ఎంపీటీసీ మల్లేశ్ పాల్గొన్నారు.
మంచాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఓటు ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనిత, రెవెన్యూ అధికారులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
యాచారం : మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో కలిసి ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ పాల్గొన్నారు.
కొత్తూరు: ప్రతి ఒక్కరూ ఓటుహక్కును విధిగా ఉపయోగించుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్ అన్నారు. స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటును సద్వినియోగం చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శరత్చంద్రబాబు, తహసీల్దార్ రాములు, హెచ్ఎంలు భాగ్యమ్మ, నర్సింహులు, బాల్రాజు, శ్రవణ్ పాల్గొనారు.