వికారాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): జిల్లాకు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా అవుతున్నది. యువత, విద్యార్థులే లక్ష్యంగా చేసుకొని కొందరు కేటుగాళ్లు గంజాయి దందాను సాగిస్తున్నారు. వికారాబాద్ పట్టణం చుట్టూ పక్కల వెలిసిన రిసార్టులలో కూడా మత్తుపదార్థాల వినియోగం విచ్చలవిడిగా ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. పోలీసులు నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారని, దీంతో ముఠాలు మరింత రెచ్చిపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు కేవలం రోడ్డు మార్గంపైనే దృష్టి సారిస్తుండడంతో అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి రైళ్లలో గంజాయిని తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశా నుంచి విశాఖ మీదుగా, కర్ణాటక నుంచి గుట్టుచప్పుడు కాకుండా రైళ్లలో జిల్లాకు గంజాయిని తీసుకొస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసుల తనిఖీల్లో తక్కువ మేర గంజాయి పట్టుపడుతున్నప్పటికీ.. రైళ్లే కేంద్రంగా వందలకొద్ది కిలోలు సరఫరా జరుగుతున్నట్లు సమాచారం. గత నాలుగేండ్లలో గంజాయిని తరలిస్తున్న 71 మందిపై కేసులు నమోదు చేయడంతోపాటు 60 కిలోలకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవారంలో న్యూ ఇయర్ వేడుకలకు రిసార్టులు ముస్తాబవుతున్న నేపథ్యంలో గంజాయి వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా రోడ్డు మార్గంతోపాటు రైళ్లలోనూ నిఘా పెట్టి గంజాయి తరలింపును అడ్డుకోవాలంటున్నారు.
జిల్లాలో పలువురు అక్రమార్కులు రహస్యంగా గంజాయి దందాను కొనసాగిస్తున్నారు. యువ త, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గుట్టుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రం చుట్టు పక్కల వెలిసిన రిసార్ట్ల్లో గంజాయిని విక్రయిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది. రైళ్లను ప్రధాన కేంద్రంగా చేసుకొని గం జాయిని జిల్లాకు అక్రమంగా తరలిస్తున్నారనే ఆ రోపణలు ఉన్నాయి. రోడ్డు మార్గంలో ఎక్కడో ఒకచోట తనిఖీల్లో బయటపడితే తమ అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట పడుతుందనే ఉద్దేశంతో రైళ్లలో తరలిస్తున్నట్లు సమాచారం అందుతున్న ది. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించకపోవడం, ఎప్పుడో ఓసారి తనిఖీలు చేపడుతుండడంతో పెద్ద మొత్తంలో జరుగుతున్నా వెలుగులోకి రా వడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఒకవేళ రైళ్లలో పట్టుబడితే పోలీసుల దృష్టి మరల్చేందుకు అక్రమార్కులు రోడ్డు మార్గంలో తమ దందాను సాగిస్తున్నారు. ప్రధానంగా రైళ్లలో ఒడిశా నుంచి విశా ఖ మీదుగా, కర్ణాటక నుంచి రైళ్లలో గుట్టుచప్పు డు కాకుండా తరలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది. నిత్యం తనిఖీలు చేయకపోవడం తో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే తనిఖీ ల్లో తక్కువ మేర గంజాయి పట్టుపడుతున్నప్పటికీ, రైళ్ల కేం ద్రంగా జరుగుతున్న దందా మాత్రం వందల కి లోలు సరఫరా జరుగుతున్నట్లు సమాచారం. మ రోవైపు జిల్లా కేంద్రంలో యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకొని గంజాయి మత్తుకు బానిసలను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
రూ.కోట్ల విలువ చేసే గంజాయి స్వాధీనం
గత నాలుగేండ్లలో 60 కిలోలకు పైగా గంజాయి ని స్వాధీనం చేసుకొని, వీటిని తరలిస్తున్న 71 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రైళ్ల ద్వారా మాత్రం వందల కిలో ల గంజాయిని జిల్లా కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాలకు తరలిస్నుట్లు అనుమానాలు వస్తు న్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాలు పెట్రేగిపోతున్న పరిస్థితుల్లో అటు రోడ్డు మార్గంతోపాటు ఇటు రైళ్లలోనూ గంజాయి తరలింపుపై నిఘా పెట్టి కట్టడి చేయాలని కోరుతున్నారు.. గంజాయితోపాటు కర్ణాటక నుంచి జిల్లాతోపాటు జిల్లా మీదుగా హైదరాబాద్కు గుట్కాలను కూ డా తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అమాయకులనే టార్గెట్గా చేసుకొని గంజాయిని రైలు మా ర్గం ద్వారా తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నా యి. గతంలో పట్టుబడిన వారంతా ఎంతో కొంత డబ్బుకు గంజాయిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే.
గంజాయి దందా ను సాగిస్తున్న అక్రమార్కులు అమాయక పేదలను లక్ష్యంగా చేసుకొని వారికి డబ్బును ఎరచూపి గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తుండడం గమనార్హం. గంజాయిని తరలిస్తూ పట్టుబడిన వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని.. అసలు నిందితులను ప ట్టుకునే దిశగా విచారణ చేయడం లేదనే విమర్శ లు వినిపిస్తున్నాయి. అసలు నిందితులు మాత్రం ఎవరనేది తెలియకుండా రహస్యంగా గంజాయిని తరలిస్తూ అక్రమంగా అర్జిస్తున్నారు. అ సలు ఎవరీ దందా సాగిస్తున్నారు, ఎవరికి చేరుతున్నదనే దానిపై సంబంధిత పోలీసులు నిఘా పెట్టడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు.
రిసార్ట్ల్లో గుట్టుగా గంజాయి విక్రయం
వికారాబాద్ జిల్లా కేంద్రం చుట్టూ పదుల సంఖ్యలో రిసార్ట్లు వెలిశాయి. యువతను ఆకర్శించేలా రిసార్ట్ల నిర్వాహకులు గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి చుట్టు పక్కల వెలిసిన రిసార్ట్లకు ప్రతి వీకెండ్కు అధిక మొత్తంలో విద్యార్థులు, యువత వస్తున్నారు. ఇదే అదునుగా రిసార్ట్ల్లో గంజాయి గుప్పుమంటున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా మరో వారంలో న్యూ ఇయర్ వేడుకలకు రిసార్ట్లను ముస్తాబు చేస్తున్న నేపథ్యంలో గంజాయినే ప్రధాన ఆకర్శణగా ఉండేలా రిసార్ట్ల నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుతున్నది. రిసార్ట్ల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్నా జిల్లా పోలీసు యంత్రాంగం మాత్రం ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిసార్ట్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో పోలీసులు అటువైపు చూడడం లేదనే విమర్శలున్నాయి. రిసార్ట్ల్లో ఏదైనా ప్రమాదాలు జరిగితే తప్పా లోపల ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనేది తెలియకపోవడం గమనార్హం.