షాబాద్, జనవరి 6: దేవాలయ వార్షికోత్సవానికి గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను శనివారం అందజేశారు. మండలంలోని దైవాలగూడ గ్రామంలో ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం జరుగనుంది.
కార్యక్రమానికి రావాల్సిందిగా గ్రామస్తులు నవాబుపేట్ మండలంలోని చించల్పేట్ గ్రామంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు కడమంచి సత్యనారాయణ, శ్రీనివాస్, అనపురం నర్సింహులు, రఘు, రమేశ్, జయరాం, విఠల్ తదితరులున్నారు.