పరిగి : గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగి మండలం నస్కల్ గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి ప్రతిష్టాపన, ఆంజనేయస్వామి ఆలయం వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల స్వరూపం మారిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు.
భక్తిభావంతో మరింత మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ చైర్మన్ అంతిగారి సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, సర్పంచ్ మేడిద పద్మమ్మ, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, నాయకులు బిల్లపాటి వెంకటేశ్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.