ధారూరు, ఏప్రిల్ 26 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో ధారూరు మండలానికి చెందిన 22మంది లబ్ధిదారులకు రూ.22,02,552/- కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. తెలంగాణాలోని ఏ ఇంట్లో ఆడబిడ్డ పెండ్లి జరిగినా ప్రభుత్వ సహకారం ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో లక్ష116రూపాయల ఆర్థికసాయం అందిస్తూ భరోసాను కల్పిస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమం, మహిళా అభ్యున్నతికి మొదటి ప్రాధాన్యతను ఇస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అనంతరం మహిళా సమాఖ్య సంఘం సభ్యులు సీలింగ్ ఫ్యాన్లు, ట్రాక్టర్ను పంపిణీ చేశారు. అదే విధంగా ముస్లింలకు రంజాన్ కానుకలు అందించారు. కార్యక్రమంలో ధారూరు ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి, ధారూరు జడ్పీటీసీ కోస్నం సుజాత, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, ధారూరు తహసిల్దార్ భీమయ్యగౌడ్, మండల వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు ఎస్.వెంకటయ్య, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోశ్కుమార్, వైస్ చైర్మన్ అంజయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్, కార్యదర్శులు రాజుగుప్తా, అంజయ్య, మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు లక్ష్మయ్య, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు దేవేందర్, చంద్రమౌళి, వీరేశం, కుమ్మరిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, నాగసముందర్ సర్పంచ్ చంద్రకళ, నాగారం ఎంపీటీసీ శ్వేతానరోత్తంరెడ్డి, నాయకులు రాములు, వెంకట్రామ్రెడ్డి, లక్ష్మయ్య, అనంతయ్య, యాదయ్య యాదవ్, భీమ్సేన్చారి, శ్రీనివాస్, మహేశ్, అనంతయ్య, రవీందర్నాయక్, గోవింద్రాజ్గౌడ్, సుధాకర్గౌడ్, చిన్నయ్యగౌడ్, విజయ్కుమార్, చెన్నయ్యగౌడ్, రైతులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
డీఏపీ వినియోగాన్ని తగ్గించాలి
రైతులు పంట పొలాల్లో పంట సాగుకు డీఏపీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో ధారూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ 45వేల ఎకరాలకు సరిపోయే అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వర్షాకాలంలో పంట సాగులో డీఏపీ వాడకాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. సమావేశంలో ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, ఎంపీడీవో చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ విజయకుమార్, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సంతోశ్కుమార్ వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..
వికారాబాద్, ఏప్రిల్ 26 : వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే ఆనంద్ ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు.