చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 22: మాజీ హోంమంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి సేవలు ఆదర్శనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఇంద్రారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని చిట్టంపల్లి గేట్ సమీపంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కార్త్తిక్రెడ్డితో కలిసి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వగ్రామమైన కౌకుంట్లలోని వ్యవసాయ క్షేత్రంలోని ఇంద్రారెడ్డి సమాధి వద్ద, స్వగృహంలో ఆయన చిత్రపటానికి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, కుటుంబసభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కాగా ఇంద్రారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని కౌకుంట్లలో సోమాజిగూడలోని ఏఐజీ దవాఖాన సౌజన్యంతో వారం రోజులపా టు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల ప్రజల ముద్దుబిడ్డగా, బడుగు, బలహీన వర్గాలకు బాసట గా.. పేదలకు అండగా నిలిచిన ఇంద్రారెడ్డి తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారన్నా రు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పటేల్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్లు గాయత్రీగోపాలకృష్ణ, సులోచనాఅంజన్గౌడ్, వెంకటేశ్యాదవ్, నాగార్జునరెడ్డి, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
ఇంకా ప్రజల గుండెల్లోనే..
అందరి నుంచి దూరమై 22 ఏండ్లు కావొస్తున్నా ఇంకా ప్రజల గుండెల్లోనే ఇంద్రారెడ్డి ఉన్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇంద్రారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని చేవెళ్ల పట్టణంలోని ఆయన విగ్రహానికి కుమారులు కార్తిక్రెడ్డి, కల్యాణ్రెడ్డి, కౌశిక్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇంద్రారెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కార్త్తిక్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ బాల్రాజ్, వైస్ ఎంపీపీ ప్రసాద్, మండలాధ్యక్షుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు మాణిక్యరెడ్డి, నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా..
పేదల సంక్షేమమే ధ్యే యంగా ఇంద్రారెడ్డి పని చేశారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఇంద్రారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకుల తో కలిసి ఆమె నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కార్త్తిక్రెడ్డి, అనంతరెడ్డి, ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాం త్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షులు జయవంత్, సుధాకర్యాదవ్, బాల్రాజ్, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్, రవియాదవ్, చంద్రలింగంగౌడ్, నరోత్తంరెడ్డి, సర్పంచ్లు రత్నం, మనోజ్కుమార్, రాఘవరెడ్డి, జనార్దన్రెడ్డి, శ్రీనివాస్, జగన్మోహన్రెడ్డి, సురేందర్గౌడ్ పాల్గొన్నారు.