పెద్దేముల్, జూన్ 25: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరి ష్కరించడానికే పల్లెనిద్ర కార్యక్రమమని మండల ఎంపీవో షేక్ సుష్మా అన్నారు. గురువారం రాత్రి మండల పరిధిలోని కందనెల్లి గ్రామంలో సర్పంచ్ టి.మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ అనుసూజ, వార్డు సభ్యులతో కలిసి రాత్రిపూట కాలనీలు అన్ని తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. వీధి లైట్లను, మురుగు కాల్వలు, సీసీ రోడ్లను,పారిశుధ్యపనులను క్షుణ్ణంగా పరిశీలించారు. శుక్రవారం ఉదయాన్నే గ్రామ పరిధిలో ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీని, ప్రధాన రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటడానికి తవ్వుతున్న గుంతలను పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్య దర్శి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బషీరాబాద్ నావంద్గి గ్రామంలో..
బషీరాబాద్, జూన్ 25: మండల పరిధిలోని నావంద్గి గ్రా మంలో పల్లెనిద్ర కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్ పాల్గొన్నారు. గ్రా మంలోని అన్ని వార్డు ల్లో కలియతిరిగి సమస్యలను తెలుసుకున్నారు. పంచాయతీ కార్యాలయంలో సర్పం చ్, వార్డు సభ్యులు, అంగన్వాడీ కార్యకర్త, ఆశ వర్కర్, పారిశుధ్య కార్మికులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఉదయం గ్రామంలోని ఇంటింటికి తిరిగి గ్రా మస్తులతో మాట్లాడారు. తడి,పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు ట్రాక్టర్లో వేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వీర మణి, ఉప సర్పంచ్ శశిరేఖ, జూనియర్ పంచాయతీ కార్యదర్శి నర్సిరెడ్డి, పాల్గొన్నారు.
నాగసముందర్ గ్రామంలో..
ధారూరు, జూన్ 25: గ్రామంలో ప్రతి స్తంభానికి దీపాలను అమర్చాలని ధారూరు ఎంపీవో షఫిఉల్లా సూచించారు. శుక్ర వారం ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ గ్రామం లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సమీపం లోని ఆర్అండ్బి రోడ్డు పక్కన చీకటి ఉండడంతో అక్కడ ఉన్న స్తంభాలకు వీధిలైట్లను వెంటనే అమర్చాలని సంబం ధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామ పం చా యతీలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో సమా వేశా న్ని నిర్వహించారు. తడి పొడి చెత్త సేకరణ, కంపోస్టు షెడ్, పాఠశాల, దవాఖానను, పశువైద్యశాలను, మురుగు కాలు వలను పరిశీలించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళ, కార్యదర్శి దేవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రాములు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, నాయ కులు విజయ్కుమార్, అనిల్కుమార్ పాల్గొన్నారు.