కోట్పల్లి : తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడ బిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో 14మందికి రూ. 14,15624 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను అందించి పేదింటి ఇంట్లో పెద్ద కొడుకు బాధ్యతలు తీర్చుతుండని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాధాకృష్ణ, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మంజులపాండు, మండల అధ్యక్షుడు అనిల్, రైతుబంధు అధ్యక్షుడు సత్యం, ఉపాధ్యక్షుడు నరేందర్రెడ్డి, నాయకులు రాములు, మల్లెశం, పాండు, మహేందర్, దశరత్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.