వికారాబాద్/కొడంగల్, ఏప్రిల్ 27: టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, మెతుకు ఆనంద్ అన్నారు. మం గళవారం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొడంగల్ అంబేద్కర్ కూడలిలో, వికారాబాద్ జిల్లా కేంద్రం లో మెతుకు ఆనంద్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో వారు టీఆర్ఎస్ పార్టీ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు నరేందర్రెడ్డి, ఆనంద్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ర్టా న్ని సాధించి ఉద్య మ పార్టీగా ప్రజాభిమానాన్ని చూరగొందని తెలిపా రు.
పొరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో మణి హారంగా నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ కాకతీయ, ఆసరా పెన్షన్ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ప్రజా మన్ననలను పొందుతున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా రూపొందించిన రైతు బంధు, బీమా పథకం దేశాన్ని అబ్బుర పరుస్తున్నాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో జిల్లాను సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారన్నారు.
టీఆర్ఎస్ శ్రేణులు పార్టీ జెండాను ఆవిష్కరించి ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. దౌల్తాబాద్ మండలంలో పలు గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సంబురాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్లు మధుసూదన్యాదవ్, శ్రీలతాయాదవ్,సరోజ, ప్రభాకర్గౌడ్.శంకర్నాయక్, సర్పంచ్లు సయ్యద్ అంజద్, పకీరప్ప, పీఏసీఎస్ డైరెక్టర్ దత్తురెడ్డి, మాజీ సర్పంచ్ రమేశ్బాబుతో పాటు టీఆర్ఎస్ నాయకులు డా.నవాజోద్ధిన్, బొంరాస్పేట నాయకులు ఎంపీపీ హెబీబాయి, వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు యాదగిరి పీఏసీఎస్ అధ్యక్షులు విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, కాన్సిలర్లు అనంతర్రెడ్డి, నవీన్, చందర్నాయక్, సురేశ్, ఉద్యమకారుడు కుమ్మరి సురేష్,మంచన్పల్లి సురేష్, నాయకులు లక్ష్మణ్, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్, ఏప్రిల్ 27: టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్య మని పీఎసీఎస్ చైర్మన్ పోలీస్ రాంరెడ్డి అన్నారు. మంగళవారం నవాబుపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నవాబుపేట సర్పంచ్విజయలక్ష్మి, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శాంతకుమార్, వార్డు సభ్యులు మాణిక్రెడ్డి పాల్గొన్నారు.
మర్పల్లి,ఏప్రిల్ 27: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి పార్టీ కార్యాలయం వద్ద జెండాను అవిష్కరించారు.కార్యక్రమంలో పార్టీ ప్రధానకార్య దర్శి మధుకర్, రైతుబంధు మండల అధ్యక్షుడు నాయబ్గౌడ్, ఎంపీటీసీ రవీందర్, పీఏసీఎస్ డైరెక్టర్ యాదయ్య, మాజీ వైస్ ఎంపీపీ అంజయ్య గౌడ్, రమేశ్ మిత్ర, పీర్యానాయక్ పాల్గొన్నారు.