వికారాబాద్ : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో మూసి నది ఉప్పొంగింది. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ ధన్నారంకు చెందిన ప్రకాష్ తన కారులో నవాబుపేటకు బయలు దేరాడు. నవాబుపేట మండలం చించల్పేట వద్ద మూసి నది దాటే ప్రయత్నం చేశాడు. వరద ప్రవహానికి కారు కొట్టుకపోయింది. కారులో ఉన్న ప్రకాశ్ చాకచక్యంగా కారులోంచి బయటికి వచ్చి ఓడ్డుకు చేరుకున్నాడు. దీంతో ప్రకాశ్ ప్రాణాలతో బయటపడ్డాడు. కారు వరద ప్రవహానికి కొద్ది దూరం కొట్టుకపోవడంతో స్థానికుల సహాయంతో పాటు జేసీబీ సహాయంతో బయటకు తీశారు. కారులు ఒకరే ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదని ఊపిరి పీల్చుకున్నారు.