బడంగ్పేట : సంత్ సేవాలాల్(Santh Sevalal) ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి (MLA Sabita Indra Reddy) అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ జీపీఆర్ కన్వెన్షన్ హాల్లో గుర్రంగూడ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కే దక్కిందన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలో సేవాలాల్ మందిరానికి స్థలం కెటాయించామని వెల్లడించారు. మహానీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
సేవాలాల్ చరిత్రను రేపటి తరాలకు తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు లక్ష్మరెడ్డి, శంకర్, ఏనుగు రాంరెడ్డి, బీమిడి జంగారెడ్డి, సంరెడ్డి వెంకట్రెడ్డి, అశోక్ పాల్గొన్నారు.