వికారాబాద్ : మున్సిపల్ పరిధిలోని ఓం శాంతి భవన్లో బ్రాహ్మకుమారిస్ గురువారం రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ మంజుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చైర్పర్సన్ మంజులకు మధుఅక్కయ్య రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మన భారతీయ హింధూ సంస్కృతిని కాపాడుతూ, నిస్వార్థ సేవ చేస్తూ ప్రజల్లో ప్రేమ తత్వాన్ని పెంపొందిస్తూ సమాజంలో శాంతి నింపడానికి ఎంతో కృషి చేస్తున్న బ్రహ్మ కుమారిస్ అందరికీ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అభినందనలు తెలిపారు. అనంతరం మహిళా కౌన్సిలర్లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు, అక్కయ్యలు, స్థానికులు పాల్గొన్నారు.