పరిగి, నవంబర్ 10 : కులకచర్ల మండల కేంద్రానికి చెందిన ఆలేటి సాయిలుకు కిడ్నీ సమస్యకు చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1.50 లక్షలకు సంబంధించిన ఎల్వోసీ కాపీని బుధవారం పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొప్పుల మాట్లాడుతూ..పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో పాటుపడుతున్నారని తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో పరిగి, కులకచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎ.సురేందర్, బృంగి హరికృష్ణ, నాయకుడు మాలె కృష్ణగౌడ్లు పాల్గొన్నారు.