తాండూరు, డిసెంబర్ 14: నాణ్యతలో మేటీ… రుచిలో అద్భుతం. అంతర్జాతీయ మార్కెట్లో తాండూరు కందిపప్పు మంచి డిమాండ్ పలుకడంతో బుధవారం తాండూరు కందిపప్పుకు భౌగోళిక గుర్తిం పు (జియోలాజికల్ ఐడెంటిఫికేషన్) లభించింది. ఇందుకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక కృషి చేసింది. తెలంగాణలో ఇప్పటికే పదిహేను ఉత్పత్తులు, వస్తువులు జీఐ గుర్తింపును పొందాయి. గతకొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యంగల తాండూరు కందిపప్పు, నిజామాబాద్ పసుపు, బాలానగర్ సీతాఫలం, వరంగల్ మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం ప్రభుత్వం తీవ్రప్రయత్నాలు చేసిం ది. దీంతో తాండూరు కందిపప్పుకు జీఎస్టీ గుర్తింపు లభించింది. ముఖ్యంగా తాండూరు కందిపప్పు దేశంలోని వివిధ రాష్ర్టాలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి అవుతోంది. దీంతో తాండూరు కందిపప్పుకు జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ రావడంతో కంది పండించే రైతులకు మరింత మంచి రోజులు వచ్చాయి. ఇక్కడి రైతులు అభివృద్ధి చెందడానికి పుష్కల అవకాశాలు లభిస్తాయని శాస్త్రవేత్తలతో పాటు వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయి తే తెలంగాణలో ఇప్పటివరకు పోచంపల్లి ఇక్కత్, నిర్మల్ కొయ్యబొమ్మలు, నిర్మల్ ఫర్నీచర్, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల చీరలు, హైదరాబాద్ హాలీమ్, చేర్యాల్ పెయింటింగ్స్, సిద్దిపేట గొల్లబామ, నారాయణపేట హ్యాండ్లూమ్ చీరలు, పోచంపల్లి ఇక్కత్ బొమ్మ, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ రగ్గులకు భౌగోళిక గుర్తింపు లభించింది.
తాండూరు కంది పప్పు ప్రత్యేకత…
తాండూరు డివిజన్లో కంది పంట సాగు అత్యధిక విస్తీర్ణంలో ఉంటుంది. అదే విధంగా దేశంలో తాండూరు కంది పప్పుకు నాణ్యతతో పాటు మంచి పేరు ఉంది. దేశంలోని అనేక రాష్ర్టాలకు తాండూ రు కందిపప్పును ఎగుమతి చేస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో తాం డూరు కంది పప్పు అంటే చాలు ప్రజలు అట్టే కొనేస్తారు. మంచి రుచితో పాటు నాణ్యత ఉండడంతో తాండూరులో తయారైన కందిపప్పుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ఈ కంది పప్పుకు త్వరగా ఉడికే గుణంతో పాటు ఎక్కువ సమయం నిలువ ఉండే లక్ష ణం కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం కోసం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి ‘తాండూరు బ్రాండ్గా ఆర్గానిక్ కంది పప్పు’ను తయారు చేసి అమ్మకాలు జరిపేందుకు గత ఏడాది నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నిర్ణ యం తీసుకుంది. అందుకు తగ్గట్లు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రూ.3 లక్షలతో కంది పప్పు తయారి మిషన్ను తీసుకు వచ్చారు. రసాయనిక ఎరువులు, మందులు వాడకుండా పండించిన పంటతో వందకు వంద శాతం నాణ్యమైన ఎలాంటి కల్తీలేని కందిపప్పును మార్కెటింగ్ చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకున్నారు. నేరుగా బయట మార్కెట్లో అమ్మకాలు జరిపేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ స్టాండెడ్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి తాండూరు కందిపప్పుకు లైసెన్స్ కూడా లభించింది. 2020 జూన్ 2న సీఎం కేసీఆర్ తాండూరులో పండించిన ఆర్గానిక్ కంది పుప్పు విక్రయాలను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేశారు. దీంతో తాండూరు కందిపప్పు పేరుతో జిల్లా కేంద్రాలతో పాటు ప్రధాన నగరాల్లో కందిపప్పు బస్తాలు లభిస్తున్నాయి.
జీఐ గుర్తింపు విధానం…
ప్రపంచ వాణిజ్య సంస్థలోని సభ్యదేశాలు తమ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆహార ఉత్పత్తులు, చేనేత కళలు, వస్తువులు, సం ప్రదాయాలు, వంటలకు భౌగోలిక గుర్తింపు ఇచ్చేందుకు ఒక ముసాయిదా తీర్మాణం చేసింది. డబ్ల్యూటీవోలో భారత దేశం కూడ సభ్య త్వం కావడంతో 2003లో కొత్త చట్టం తీసుకు వచ్చారు. అప్పటి నుంచి జీఐ కొరకు వచ్చే దరఖాస్తులను క్షణ్ణంగా పరిశీలించి అభ్యంతరాలు స్వీకరించి జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ జారి చేస్తున్నారు. దీంతో ఒక ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన వస్తువులకు, ఆహార ఉత్పత్తులు, సంప్రదాయ తదితర వాటికి భౌగోళిక గుర్తింపు జారీ చేస్తారు. అందుకు గుర్తింపునకు వచ్చే దరఖాస్తులో పూర్తి సమాచారం చెన్నై కేంద్రంగా ఉన్న జీఐ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. పరిశీలన, అభ్యంతరాలు, పూర్తి విచారణ తరువా త జీఐ జర్నల్లో ముద్రిస్తారు. అనంతరం జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 6 నెలల నుంచి 12 నెలల సమయం పడుతుంది. భౌగోళిక గుర్తింపు పొందిన సం స్థలు, వ్యక్తులు మాత్రమే జీఐ పేరును వినియోగించాల్సి ఉంటుంది. ఇతరులు వినియోగిస్తే సివిల్, క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకునే వెసులుబాటు కల్పించారు.
చాలా సంతోషంగా ఉంది
దేశంలో విశేష గుర్తింపు పొందిన ఉత్పత్తులు, వస్తువులకు మాత్రమే జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ లభిస్తుంది. తెలంగాణ సర్కార్ కృషితో తాండూరు కందిపప్పుకు జీఐ గుర్తింపు రావడం చాల సంతోషంగా ఉంది. దీంతో ఇతరులు తాండూరు కందిపప్పు పేరుతో వ్యాపారం చేసే అవకాశం ఉండదు. ఈ ప్రాంతం రైతులకు మంచి రోజులు వస్తాయి. భారత పరిశ్రమల సమాఖ్య, వ్యవసాయ పరిశోధన స్థానం కలిసి తాండూరు కందిపప్పుకు భౌగోళిక సూచిక సాధించడానికి సహకారం అందించాయి. తాం డూరు బ్రాండ్గా ఆర్గానిక్ కంది పప్పును తయారు చేసి మార్కెట్లో అమ్మకాలకు కూడా ఉంచడం జరిగింది. ఊహించిన దానికంటే ఎక్కువగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
– డా.సుధాకర్ ప్రధాన శాస్త్రవేత్త, తాండూరు వ్యవసాయ కేంద్రం