కోట్పల్లి : పురుగుల మందు తాగి వివాహిత మృతి చెందిన సంఘటన కోట్పల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగసాన్పల్లి గ్రామానికి చెందిన ప్రేమలత (45), జిన్నారం గ్రామానికి చెందిన ఎరోల్ల సామెల్తో 12 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరికి అప్పులు ఎక్కువ అవడంతో భార్యభర్తల మద్య గొడవలు చోటుచేసుకున్నాయి.
సోమవారం గొడవ పెద్దది కావడంతో కోట్పల్లి సంతకని వెళ్లిన ప్రేమలత పురుగుల మందు తీసుకుని కోట్పల్లి-లింగంపల్లి సమీపంలో మందు సేవించి రోడ్డు ప్రధాన పక్కనే ఓ చెట్టు కింద పడి మృతి చెందింది. మృతురాలి తమ్ముడు గడ్డమీది ప్రవీణ్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు.