వికారాబాద్ : సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంటుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని క్లబ్ ఫంక్షన్హాలులో తెరాస పార్టీ యువజన, సోషల్ మీడియా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని, ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పార్టీ పటిష్టత కోసం పని చేయలన్నారు. తల్లి వంటి పార్టీపై విమర్శలను తిప్పి కొట్టి, ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
కార్యకర్తలు క్రమ శిక్షణతో మసులుకోవాలని, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షుడు, సోషల్ మీడియా అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.