పరిగి : పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ ఎం.నారాయణ అన్నారు. శనివారం వికారాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సీఐలు, ఎస్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ మాట్లాడుతూ పిటిషనర్తో మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతోపాటు వారి ఆవేదనను సహనంతో వినాలని చెప్పారు. వారికి న్యాయం చేస్తామనే భరోసా కల్పించాల్సిందిగా పేర్కొన్నారు. కేసులకు సంబంధించి ఎలాంటి పెండింగ్ పెట్టరాదని ఎస్పీ చెప్పారు. ప్రతి కేసులో పూర్తి పరిశోధన చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగించుకోవాలన్నారు.
నేరం మోపబడిన నిందితుడిపై కేసు నమోదు చేసిన వెంటనే పూర్తి పరిశోధన జరిపి, అవసరమైతే అరెస్టు చేసి వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో వికారాబాద్, పరిగి, తాండూరు డీఎస్పీలు సత్యనారాయణ, శ్రీనివాస్రావు, లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.