బషీరాబాద్ : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్సై విద్యాచరణ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జమ్లానాయక్తండాకు చెందిన శ్రీను తన ట్రాక్టర్లో మైల్వార్ రోడ్డు మార్గంలో దామర్చేడ్ శివారులో గల వాగులో దొంగతనంతో ఇసుక నింపుచుండగా, పొలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాక్టర్ను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ట్రాక్టర్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.