కులకచర్ల : ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు కులకచర్ల ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు. మంగళవారం కులకచర్ల మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను కనిపించడంతో పట్టుకొని పోలీస్టేషన్కు తరలించారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న ఏపీ22ఎకె5082 గల ట్రాక్టర్ను పట్టుకొని సీజ్ చేసినట్లు వారు తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.