వికారాబాద్ : పోలీస్ శిక్షణ కేంద్రం చాలా పవిత్రమైదని, ఇందులో నుంచే రాష్ట్రానికి వజ్రంలాంటి సిబ్బంది వస్తుంటారని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ డీటీసీ (పోలీస్ జిల్లా శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి, పోలీసులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ అంటేనే క్రమ శిక్షణకు పెట్టింది పేరని, పోలీస్ అధికారులకు శిక్షణ నేర్పే స్థలాన్ని ప్రత్యేకంగా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పరేడ్ గ్రౌండ్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది అందరూ శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలని తెలిపారు.
సిబ్బంది సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట జిల్లా అదనపు ఎస్పీ ఎం.ఏ.రశీద్, టీడీసీ అదనపు ఎస్పీ, డీటీసీ డీఎస్పీ విజయ్కుమార్, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు, డీసీటీ ఇన్స్పెక్టర్ మల్లేశం, ఆర్ఐ, ఎస్ఐలు ఉన్నారు.