తాండూరు : తాండూరులో బుధవారం టాస్క్ఫోర్స్ బృందం మెరుపు దాడులు నిర్వహించింది. అక్రమ రేషన్ బియ్యం నిల్వలతో పాటు అనుమతులు లేకుండా క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. టాస్క్ఫోర్స్ సిబ్బంది కథనం ప్రకారం.. తాండూరు పట్టణంలోని మల్లప్ప మడిగె సమీపంలోని దుకాణంలో బస్వరాజ్ అక్రమంగా నిల్వ చేసిన 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని కేసు పెట్టినట్లు తెలిపారు. అదే విధంగా పాత తాండూరుకు చెందిన మన్సూర్ అహ్మద్, మహ్మద్ ముషేర్ అనుమతులు, జీఎస్టీ, డీలర్షిప్ లేకుండా క్రిమిసంహారక మందులు విక్రయిస్తుండడంతో వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పరిగిలో..
పరిగి టౌన్, అక్టోబర్ 20 : అక్రమంగా నిల్వ ఉంచిన 14 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఘటన బుధవారం రాత్రి పరిగి పట్టణంలో జరిగింది. పక్కా సమాచారంతో గంజ్రోడ్డులోని కట్టా అనిల్ కుమార్ దుకాణంలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించగా దుకాణంలో 14 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలను స్థానిక పోలీస్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం ఎవరి వద్ద కొనుగోలు చేసి ఎవరికి విక్రయిస్తున్నారన్న కోణంలో టాస్క్ఫోర్స్ పోలీసులు విచారణ చేపట్టారు.