పరిగి టౌన్ : గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న నిషేధిత గంజాయి మొక్కలను ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మంగళవారం ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ కాళ్లాపూర్ గ్రామానికి చెందిన పరిగి నర్సింలు ఇంటి ముందు సాగుచేస్తున్న 8గంజాయి మొక్కలు, 80 గ్రాముల గంజాయి పొడి లభించిందన్నారు. జాఫర్పల్లి గ్రామానికి చెందిన చాకలి లాలయ్య వ్యవసాయ పొలంలో సాగుచేస్తున్న 12గంజాయి మొక్కలు లభించాయని వాటిని స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. పరిగి నర్సింలు పరారీలో ఉండగా చాకలి లాలయ్యను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై రాఘవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.