కులకచర్ల : గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో రైస్మిల్లులు నెలకొల్పడం అభినందనీయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల పరిధిలోని కుస్మ సముంద్రం గ్రామ పరిధిలో మాజీ ఎంపీపీ గందె అరుణరాజప్ప నూతన రైస్మిల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో రైస్మిల్లులను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని స్థానికంగానే కొనుగోలు చేసి వాటిని రైస్మిల్కు తరలించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
సరిపోను రైస్మిల్లు లేక ఇతర జిల్లాలకు పంపాల్సిన పరిస్థితి ఉండేదని, స్థానికంగా రైస్మిల్ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మేలుకలుగడంతో పాటు, కొంతమందికి ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కులకచర్ల, దోమ మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కులకచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామ పరిధిలో మరో రైస్మిల్ను ఆయన ప్రారంభించారు.