పరిగి : పరిగి మండలం యాబాజిగూడ గ్రామంలో జరుగుతున్న ఆంజనేయస్వామి పునః ప్రతిష్ట, ధ్వజ స్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలకు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం శాంతిపాఠం, గణపతి పూజ, పుణ్యహవచనం, ఆవాహిత దేవత పూజలు, గర్తసంస్కారం, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, కళాన్యాసం, ప్రాణప్రతిష్ట, నోత్రోన్మలనం, మహా పూర్ణాతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమాలలో జడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, సర్పంచ్లు ప్రవీణ్, నల్క జగన్, భక్తులు పాల్గొన్నారు.