తాండూరు : తాండూరు రైల్వే స్టేషన్లో సుందరీకరణ పనులు వేగంగా చేయాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ డీఆర్ఎం ఏకే గుప్తా రైల్వే శాఖ అధికారులకు సూచించారు. గురువారం తాండూరు రైల్వే స్టేషన్ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. టికెట్ కౌంటర్, రైల్వే పార్కు, ట్రాక్ మరమ్మతులతో పాటు ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నవంబర్ 23న రైల్వేశాఖ ఉన్నతాధికారుల పర్యటన ఉందని తెలిపారు. ప్రయాణీకులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.