వికారాబాద్ : పార్వతీ పరమేశ్వరుని గుట్టను తవ్వి మట్టిని తీసుకపోవడం వంటి పనులు వెంటనే నిలిపి వేయాలని విశ్వహిందూ పరిషత్ వికారాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బందెప్పగౌడ్, ప్రశాంత్కుమార్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని పరమేశ్వరుడి గుట్టకు తవ్వకం పనులు నిలిపి వేయాలని తాసిల్దార్ కృష్ణయ్యకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న పవిత్రమైన పార్వతీ పరమేశ్వరుడి గుట్టను తవ్వి మట్టిని తీసుకెళ్లడం వెంటనే ఆపాలని కోరారు.
మిషన్ భగీరథ ట్యాంక్ పక్క నుంచి గత కొన్ని రోజులుగా గుట్టను తవ్వడంతో గ్రామస్తులు వెళ్లి నిలిపివేయాలని విన్నవించగా, ఎదురు వాడికి దిగుతున్నట్లు తాసీల్దార్కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. తవ్వకాలను నిలిపివేసి దేవాలయ ప్రాధాన్యతను కాపాడాలని తాసిల్దార్ను కోరారు. వీరి వెంట ప్రభాకర్, శ్రీశైలం, పూడూరు భజరంగ్దల్ సభ్యులు శ్రీశైలం, శివశంకర్, మానవ హక్కుల కమిషనర్ జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డి ఉన్నారు.