మర్పల్లి : అపోహాలు వీడీ ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. గ్రామంలో విద్యుత్ సమస్యలు ఉండటంతో గ్రామంలో, పొలాల వద్ద వేలాడుతున్న వైర్లను వెంటనే సరి చేయాలని, అవసము ఉన్నచోటా నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. గ్రామంలో మురుగు కాలువలు, రోడ్లు పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా ప్రతి ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత, ఎంపీటీసీ రవీందర్, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లేశం, రైతుబంధు మండలాధ్యక్షుడు నాయబ్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, సీనియర్ నాయకులు ప్రభాకర్గుప్తా, రామేశ్వర్, మధుకర్ నాయకులు పాల్గొన్నారు.