పరిగి : ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మంజూరైన వంటగ్యాస్ కనెక్షన్లను శుక్రవారం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అందజేశారు. పరిగిలోని శ్రీనివాస్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు ఎమ్మెల్యే వంటగ్యాస్ కనెక్షన్ల ధ్రువపత్రాలు, స్టౌవ్లు, సిలెండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీడీవో శేషగిరిశర్మ, ఎంపీవో దయానంద్, టీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్రెడ్డి, రవికుమార్, మునీర్, తాహెర్అలీ పాల్గొన్నారు.