వికారాబాద్, మే 28 : దశాబ్ది ఉత్సవాల సంబురాలు అంబరాన్నంటాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనం ద్ పిలుపునిచ్చారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణ పై ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా జూన్ 2 నుంచి 22వరకు 21 రోజుల పాటు తెలంగాణ అవతరణ దినోత్సవాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లె, ప్రతి వాడలో ఘనంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 21 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నేడు సమావేశం
పూడూరు : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పై సోమవారం మండల కేంద్రంలో ఎంపీపీ మల్లేశం అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావే శం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఉమాదేవి తెలిపారు. జూన్ 2నుంచి 22వరకు పలు కార్యక్రమాలు నిర్వహి స్తూ ఘనంగా ఉత్సవాలను జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
మర్పల్లిలో..
మర్పల్లి : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలపై సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాజమల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 2 నుంచి 22 వరకు 21 రో జుల పాటు మండలంలోని గ్రామాల్లో నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. మండల ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.