పరిగి టౌన్ : అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని సొంత మామను కోడలు ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. శుక్రవారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ మంగమ్మ భర్త మూడు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఈమెకు ఓ కుమారుడు ఉన్నాడు. భర్త చనిపోయిన నాటి నుంచి గ్రామానికి చెందిన నఫీజ్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. కోడలు వ్యవహారం సరిగ్గా లేకపోవడంతో మామ బోయ కిష్టయ్య(75) పలుమార్లు హెచ్చరించాడు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న మామను ఎలాగైనా హత్య చేయాలనుకుని ప్రియుడితో కలిసి శుక్రవారం అర్ధరాత్రి మెడకు వైరు బిగించి హత్య చేశారు.
శనివారం ఉదయం తన మామ పిలిస్తే పలుకడం లేదని బంధువులకు తెలిపింది. దీంతో వారు వచ్చి చూసే సరికి మెడపై గాయాలైనట్లు గుర్తించి మంగమ్మను చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ లక్ష్మిరెడ్డి వివరాలు సేకరించారు. అనంతరం మంగమ్మను పరిగి పోలీస్టేషన్కు తరలించి మంగమ్మతో పాటు ఆమె ప్రియుడు నఫీజ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.