వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని రామమందిర్ ఆవరణలో పర్వతీ పరమేశ్వరుడి కల్యాణం కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆధ్యాత్మిక సేవామండలి ఆధ్వర్యంలో జరిగిన పర్వతి పరమేశుడి కళ్యాణానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున్న తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. పూజలలో భాగంగా మహారుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు సాయంత్రం వరకు జరిగాయి. ఈ పర్వతి పరమేశుడి కల్యాణానికి చేవెళ్ల శాసన సభ్యుడు కాలె యాదయ్య, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఆధ్యాత్మిక సేవామండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.