వికారాబాద్ : వికారాబాద్ పట్టణం 19వ వార్డు రామయ్యగూడలో అయ్యప్ప మాలాదారులు శనివారం మహా పడిపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయ్యప్పస్వాములు స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ తీర్థ ప్రసాదాలు, నైవేధ్యాలు సమర్పించారు. అభిషేకాలు, మంగళ హారతులు, పాటలు పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
ఎమ్మెల్యేతో పాటు పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్ కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, కౌన్సిలర్లు కొండేటి కృష్ణ, సుధాకర్రెడ్డి, నాయకులు ఎల్లయ్య, చంద్రయ్య, పర్మయ్య, యాదయ్య, సుభాశ్ ఉన్నారు.