దోమ : దోమ పోలీసు స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ నారాయణ పలు రికార్డులను పరిశీలించి పెండింగ్లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించడానికి కిందిస్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం దోమ పోలీసు స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కువ కాలంగా కేసులు పరిష్కారం కాకుండా నిలిచిన కేసులపై దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ఎప్పటికప్పు డు తగు జాగ్రత్తలు తీసుకుని శాంతియుత వాతావరణం కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వెంకట్రామయ్య, ఎస్సై రమేశ్ పాల్గొన్నారు.