నవాబుపేట : చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న మండలాల్లోని గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్ధేశంతో ‘శుభోదయ’ కార్యక్రమం చేపట్టానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవాబుపేట మండలం తాను ఎమ్మెల్యే అయ్యకేనే అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ అధికారంలో ఉండగా జరుగలేదని విషయం యావత్ మండల ప్రజలకు పూర్తిగా తెలుసని పేర్కొన్నారు. అలాంఖాన్గూడ నుంచి పుల్మామిడి వరకు గల బీటీ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చి లైటింగ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘శుభోదయ’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్థానిక సమస్యలను పరిష్కరించడమే కాకుండా ప్రజలకు అవసరమైన మౌళిక వసతుల కల్పనలో ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు సోషల్ మీడియాలో తమకు ఇష్టమొచ్చిన్నట్లు టీఆర్ఎస్ నాయకులపై ప్రచారం చేస్తున్నారని అది మంచి పద్ధతి కాదన్నారు.
ప్రస్తుం నవాబుపేట మండలానికి రూ. 10కోట్లు మంజూరు కాగా అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు యావపూర్, అర్కతాల గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే సర్పంచులతో కలిసి గ్రామాల్లోని ప్రతీ వీధి తీరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడే ఉన్న అధికారులతో పరిష్కరింపజేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో 164 గ్రామాలు ఉన్నాయని వారానికి ఒకసారి 5మండలాల్లోని గ్రామాల్లో తిరుగుతూ నేరుగ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు.