కోట్పల్లి, ఆగస్టు 3: ‘మీతో నేను’ అనే కార్యక్రమంతో కాలనీల్లో తిరిగి, సమస్యలను గుర్తించి వారంలోగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మం గళవారం మండలంలోని బార్వాద్, మద్గుల్తండాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. తండాల్లో ఉన్న సమస్యలను గుర్తించారు. అనంతరం బార్వాద్తండాలో ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సంబంధిత అధికా రులు వెంటనే పరిష్కార మార్గాలను చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కొరకు నూతన మం డలాలు, నూతన పంచాయతీలను ఏర్పాటు చేసిందని, దాంట్లో భాగంగా అభివృద్దిని కూడా అదే తరహాలో చేస్తుందన్నారు. తండాల్లో పరిశుభ్ర వాతావరణాన్ని తీసుకు వచ్చిం దన్నారు.
తండాల్లో చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. బార్వాద్కు గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కవితామోహన్సింగ్, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ ఉమాదేవీ, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు సత్యం, మండల పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్కుమార్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.