వికారాబాద్, జూలై 24: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మున్సి పల్ చైర్పర్సన్ మంజుల ఆధ్వర్యంలో, ఆలంపల్లి నుంచి కొత్తగడి వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే ఆనంద్, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ పౌసుమిబసు హాజరయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అందజేసిన డిక్షనరీలను శివారెడ్డిపేట మైనార్టీపాఠశాలలో ఎమ్మెల్యే విద్యార్థులకు అందజేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ తరగిపోతున్న వృక్ష సంపదను తిరిగి తేవాలని సూచించారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి ని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలన్నారు. అనంతరం వికారాబాద్ మండల పరిధిలోని ధ్యాచారం గ్రామం సమీపంలో ఉన్న సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ శంషాద్బేగం, ఏఎంసీ చైర్మన్ విజయ్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, కమిషనర్ బుచ్చయ్య, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముత్తహర్షరీఫ్, కౌన్సిలర్లు కిరణ్పటేల్, రామస్వామి, పావనిచంద్రశేఖర్, అనంత్రెడ్డి, కృష్ణ, చందర్నాయక్, గోపాల్, అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ లావణ్య, బీట్ ఆఫీసర్ మధుకర్రెడ్డి పాల్గొన్నారు.
ధారూరు మండలం అటవీ ప్రాంతంలో…
ధారూరు జూలై 24 : ధారూరు మండలం గట్టేపల్లి గ్రామ పరిధి అటవీ ప్రాంతంలో వికారాబాద్ ఎమ్మె ల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మా ట్లాడుతూ ప్రభుత్వం అడవుల శాతం పెరగడానికి ఎంతగానో కృషి చేస్తున్నదన్నారు. ప్రతి ఒక్కరూ హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు.
కొడంగల్లో మున్సిపల్ కార్మికులు
కొడంగల్, జులై 24 మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్మికులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి కౌన్సిలర్లు సిబ్బంది, కార్మి కులతో కలిసి కేక్ కట్ చేయడంతో పాటు హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని ఆయా లేఅవుట్లలోని ప్రభుత్వ స్థలాల్లో రెండు వేలకు పైగా మొక్కలను నాటారు. అదేవిధంగా కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని స్థానిక అతిథిగృహంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గోడల రాంరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు కేక్కట్ చేసి సంబురాన్ని జరుపుకొన్నారు.
హరిత తెలంగాణగా మార్చుదాం
బంట్వారం, జూలై 24 : ముక్కోటి వృక్షార్చనతో హరిత తెలంగాణగా మార్చుదామని మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గంచెర్వు మల్లేశం పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని మండల కేం ద్రంలో సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మండల రైతు బంధు అద్యక్షుడు ఖాజాపాష, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచ్లు నర్సింహులు, నర్సింహారెడ్డి, నాయకులు చందుసింగ్, శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
కోట్పల్లి మండల కేంద్రంలో..
కోట్పల్లి, జూలై 24: మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మంజుల, బస్టాండ్ వద్ద మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి హాజరయ్యారు. బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎం పీపీ శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అనిల్కుమార్, పీఎస్సీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, సర్పం చ్ విజయలక్ష్మి, రైతుబంధు అధ్యక్షుడు సత్యం,మత్స్యశాఖ మండల చైర్మన్ ఆనంద్, నాయకులు రాములు, పాండు, మల్లేశం, దశ్థ్గ్రౌడ్, బందెయ్య, మహేందర్, సర్పంచులు పాల్గొన్నారు.