వికారాబాద్ : వికారాబాద్ పట్టణానికి అతి సమీపంలో పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అనంత పద్మనాభ స్వామి ఆలయానికి భక్తులు పొటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులు క్యూ పద్ధతి పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు ఆలయ ఆవరణలో సేద తీరుతూ సెల్ఫీలు, ఫోటోలు దిగారు.