మోమిన్పేట : డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మండల ప్రజాప్రతినిధులతో కలిసి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు.
నిర్మాణంలో నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసారిగా పాటించేలా అధికారులు తనిఖీలు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు ఉన్నారు.