వికారాబాద్, మార్చి 1: ఇంటర్ పరీక్షల్లో కాపీయింగ్ కు తావులేకుండా కఠినంగా వ్యవహరించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఇన్విజిలేటర్లకు సూ చించారు. శుక్రవారం ఆయన అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలోని ఇంటర్ మొదటి ఏడాది ఆంగ్ల పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ కేంద్రంలో 318 మంది విద్యార్థు లు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 13 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని..విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడకుండా ఇన్విజిలేటర్లు కఠినంగా వ్యవహరించాలన్నా రు.
జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన మొదటి ఏడాది ఆంగ్ల పరీక్షకు 8,565 మంది విద్యార్థులకు 8,248 మంది హాజరు కాగా 317 మంది గైర్హాజరయ్యారు. నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి ముందుగానే చేరుకున్నారు. కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు. జనరల్లో 6,872 మంది విద్యార్థులుండగా 6,655 మంది హాజరుకాగా.. 217 మంది గైర్హాజరయ్యారు. ఒకేషన్ లో 1,693 మందికి 1,593 మంది పరీక్ష రాయగా 100మంది హాజరుకాలేదు. మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.